ఏపీలో తగ్గిన కరోనా కేసులు

by  |
AP corona Update
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటి కంటే ఈరోజు పాజిటివ్ కేసులు తగ్గాయి. వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 59,641 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,546 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,70,008కి చేరింది.

నిన్న ఒక్కరోజే కరోనాతో 15 మంది మరణించగా ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 13,410కి చేరింది. అదే సమయంలో కరోనా నుంచి 1,968 నుంచి కోలుకోగా మెుత్తం రికవరీల సంఖ్య 19,36,016కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,582యాక్టివ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,47, 08,540 సాంపిల్స్‌ను పరీక్షించడం జరిగింది.


Next Story

Most Viewed