కుళ్లిన మృతదేహం కలకలం

by  |
కుళ్లిన మృతదేహం కలకలం
X

దిశ, మహబూబాబాద్: కుళ్లిపోయిన మృత దేహం మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఎస్సై జగదీశ్ కథనం ప్రకారం.. మండలంలోని కస్తూరినగర్ గట్టు ముసలమ్మ ప్రాంతంలో ఓ గొర్రెల కాపరి… దుర్వాసన వస్తున్న మృత దేహాన్ని గుర్తించాడు. పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఎస్సై జగదీశ్ అక్కడికి చేరుకొని కుళ్లిపోయిన మృతదేహాన్ని పరిశీలించి.. వెంకటాపురం గ్రామానికి చెందిన ఇస్లావత్ బాలాజీగా గుర్తించారు. కాగా మృతురాలి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed