మధ్యప్రదేశ్ ప్రమాద ఘటనలో 49కు చేరిన మృతుల సంఖ్య

by  |
మధ్యప్రదేశ్ ప్రమాద ఘటనలో 49కు చేరిన మృతుల సంఖ్య
X

దిశ,వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌ బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 49కు చేరింది. తాజాగా నేడు మరో రెండు మృత‌దేహాలను సహాయ బృందాలు వెలికి తీశాయి. సిద్ది జిల్లా పట్నా వద్ద మంగళవారం ప్రయాణీకులతో కూడిన బస్సు కాల్వలో పడింది. ఈ సమయంలో బస్సులో 60 మంది ప్రయాణీకులు ఉన్నారు. వారిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించింది.



Next Story

Most Viewed