జడ్చర్లలో విషాదం.. భారీ వర్షానికి కొట్టుకొచ్చిన మృతదేహం

by  |
జడ్చర్లలో విషాదం.. భారీ వర్షానికి కొట్టుకొచ్చిన మృతదేహం
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో విషాదం నెలకొంది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. అయితే, డ్రైనేజీ గుంతలో పడి ఈ వ్యక్తి మృతి చెంది ఉంటాడని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు.

మృతదేహాన్ని పట్టుకుని బంధువులు రాస్తారోకో నిర్వహిస్తున్నట్టు సమాచారం. కాగా, జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులన్నీ జలమయం కావడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కంట్రోల్ రూం ద్వారా సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.



Next Story

Most Viewed