కరోనా లేకున్నా జేసీబీతో అంత్యక్రియలు..

by  |
కరోనా లేకున్నా జేసీబీతో అంత్యక్రియలు..
X

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా కష్టకాలంలో మనుషుల్లో మానవత్వం నశిస్తోంది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను హీనంగా ఖననం చేస్తున్నారు. విచిత్రం ఎంటంటే కరోనా లేకపోయిన ఓ యువకుడి మృతదేహాన్నిఆ గ్రామ సర్పంచ్ జేసీబీతో ఖననం చేయించారు.. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామపంచాయతీలో ఓ యువకుడు చనిపోయాడు. అతనికి కరోనా లేకున్నా.. ఉండొచ్చన్న అనుమానంతో అంత్యక్రియలకు సర్పంచ్ అడ్డుచెప్పాడు. కోవిడ్ పేషెంట్ మృతదేహానికి చేసినట్టుగానే జేసీబీతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించాడు. అంత్యక్రియలు చేసేందుకు కేవలం తల్లిదండ్రులకు మాత్రమే.. అది కూడా పీపీఈ కిట్లు వేసుకొనే వెళ్లాలని స్పష్టం చేశాడు. సర్పంచ్ ఆదేశాలతో గ్రామ సిబ్బంది యువకుడి మృతదేహానికి జేసీబీతోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనలో సర్పంచ్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Next Story