గంగానదిలో తేలిన 50మృతదేహాలు.. ఏం జరిగింది?

by  |
గంగానదిలో తేలిన 50మృతదేహాలు.. ఏం జరిగింది?
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లోని బక్సర్ జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. గంగానదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు కనిపించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మహాదేవ్ ఘాట్ సమీపంలో ఒక్క కిలోమీటరు పరిధిలోనే 48 శవాలు కనిపించాయి. చాలా మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. ఒడ్డుకు కొట్టుకొచ్చిన శరీరభాగాలను కుక్కలు పీక్కుతిన్నాయి. కరోనాతో చనిపోయినవారిని తమ బంధువులే ఇలా గంగా నదిలో పడేశారని సమాచారం.


Next Story

Most Viewed