డీసీఎం వ్యాన్ బోల్తా.. 70కి పైగా గొర్రెలు మృతి

by  |
డీసీఎం వ్యాన్ బోల్తా.. 70కి పైగా గొర్రెలు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం డోర్నకల్ మండలం పెరుమాండ్లసంకీస గ్రామ సమీపంలో అదుపు తప్పి గొర్రెల వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో డీసీఎం వ్యాన్‌లో ఉన్న 70కి పైగా గొర్రెలు మృతి చెందాయి. ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గొర్రెలను డీసీఎం వ్యాన్‌లో గూడూరు నుంచి మధిరకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed