డీసీఎం వ్యాన్ బోల్తా.. 22 మందికి గాయాలు

by  |
డీసీఎం వ్యాన్ బోల్తా.. 22 మందికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి గొలగమూడి వద్ద అదుపుతప్పి డీసీఎం వ్యాన్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 22 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed