సర్వత్ర ఉత్కంఠ..

by  |
సర్వత్ర ఉత్కంఠ..
X

దిశ, హైదరాబాద్
తెలంగాణలో నేడు డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఇవాళ జరగనుండటంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. దీని కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఆశావహులు కూడా తమదైన శైలిలో లాబీయింగ్‌లు చేస్తూనే ఉన్నారు. కాగా, చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఇప్పటికే సీల్డ్‌కవర్‌లో మంత్రి కేటీఆర్ శుక్రవారం జిల్లా పరిశీలకులకు అందజేసినట్టు సమాచారం.ఈ రోజు ఉదయం మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో కవర్లు తెరిచి, అందులోని పేర్లు ఉన్న అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు.


Next Story

Most Viewed