అర్ధరాత్రి మేనమామ ఇంట్లో ప్రియుడితో కలిసి..

by  |
uncle Murder
X

దిశ, వెబ్‌డెస్క్ : రెండు క్షణాల ఆనందం కోసం దేనికైనా సిద్ధపడుతున్నారు నేటి యువత. తన ఆనందానికి అడ్డొస్తే అంతం చేయడానికైనా వెనకాడటం లేదు. ఫ్రెండ్స్ అయినా.. బంధువులైనా.. చివరికి కన్న తల్లిదండ్రులనైనా కడతేర్చేందుకు వెనకాడటం లేదు. తాజాగా ఓ యువతి బాయ్ ఫ్రెండ్‌తో తనకున్న ఎఫైర్‌ను చూశాడని మేనమామనే హత్య చేసింది. ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. వారి కథనం ప్రకారం..

బండా జిల్లాలోని అతర్రాకు చెందిన ఉషతో కృష్ణానగర్‌కు చెందిన ఓంప్రకాష్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రేమలో మునిగిన వారిద్దరు రోజూ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేవారు. ఈక్రమంలో ఓ రోజు ఈ జంట ఉష మేనమామ అయిన రామఖేలావన్ కంటపడింది. మేన కోడలి వ్యవహారానికి ఆగ్రహించిన ఆయన ఆమెను మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే విషయం ఇంట్లో చెబుతానని హెచ్చరించాడు. అక్కడి నుంచి జారుకున్న ప్రేమికులు రామఖేలావన్‌పై కోపాన్ని పెంచుకున్నారు. తమ ఆనందానికి అడ్డువస్తున్నాడని, అతడు ఉంటే తాము కలుసుకోలేమని భావించారు. ఈ క్రమంలోనే మేనమామను చంపేయాలని నిర్ణయించుకున్నారు.

అదును కోసం ఎదురు చూసిన ఉష.. ఈ నెల 13న రాత్రి ప్రియుడు ఓం ప్రకాష్ కలిసి మేనమామ ఇంటికి చేరుకుంది. అప్పటికే నిద్రలో ఉన్న రామఖేలావన్‌పై తలపై బండరాళ్లు, ఇటుకలతో తీవ్రంగా దాడి చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న రామఖేలావన్‌ను చనిపోయాక ఇద్దరు కలిసి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు అది రోడ్డు ప్రమాదం కాదని.. ఎవరో దుండగులు హత్య చేసినట్లు గుర్తించారు.

కేసు నమోదు చేసిన అతర్రా పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఉషపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. మర్డర్ విషయం వెలుగు చూసింది. తమ ప్రేమకు అడ్డు వస్తున్నాడనే ఇద్దరం కలిసి హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. దీంతో ప్రేమికులిద్దరిని శుక్రవారం అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి తుపాకీ, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి :

‘ఆ’ పనిలో బోర్ కొట్టకుండా.. భర్తలను, భార్యలను మార్చుకుని శృంగారం


Next Story

Most Viewed