మామను చంపిన కోడలు.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by  |
Murder
X

దిశ, పరిగి : వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో ఓ కోడలు ఏకంగా మామను హత్య చేసింది.పరిగి సీఐ లక్ష్మీ రెడ్డి కథనం ప్రకారం.. బోయ నర్సింహులు–బోయ మంగమ్మ భార్యాభర్తలు. బోయ నర్సింహులు నాలుగేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి బోయ మంగమ్మ గ్రామానికి చెందిన మహమ్మద్​నఫ్పీస్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. తమ బంధానికి మామ బోయ క్రిష్ణయ్య అడ్డుగా వస్తున్నాడని.. ఎలాగైనా అతన్ని అడ్డు తొలగించుకోవాలని భావించింది.

కోడలు మంగమ్మ, ఆమె ప్రియుడు నఫ్సీస్‌లు కలిసి శుక్రవారం అర్థరాత్రి మామ బోయ కిష్టయ్య (75)ను గొంతు నులిమి హత్య చేశారు. హత్య అనంతరం మంగమ్మ ఏమీ తెలియనట్టు కల్లు తాగి బోర్లాపడి మృతి చెందినట్లు నమ్మించ బోయిందని గ్రామస్తులు తెలిపారు. గొంతుపై గాయాలు ఉండటంతో మంగమ్మను తమదైన శైలిలో విచారించగా అసలు విషయం అంగీకరించింది. ఈ మేరకు మృతుడి కూతురు బోయ బందెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మంగమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ లక్ష్మీరెడ్డి తెలిపారు.



Next Story