వాటి వల్లే బతికాను : దత్తాత్రేయ

by  |
వాటి వల్లే బతికాను : దత్తాత్రేయ
X

దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ వద్ద ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సూర్యాపేటలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దత్తాత్రేయతోపాటు డ్రైవర్‌, ఆయన వ్యక్తిగత సహాయకుడు క్షేమంగా బయటపడ్డారు. తాజాగా దీనిపై దత్తాత్రేయ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాద స్థలంలో ఉన్న చెట్లవల్లే తాను బతికిబయట పడ్డానని అన్నారు. చెట్లే తన ప్రాణాలు కాపాడాయని తెలిపారు.



Next Story

Most Viewed