ముహూర్తం ఫిక్స్.. డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరేది అప్పుడే..!

by  |
srinivas congres
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్​ కాంగ్రెస్‌లో చేరనున్నారు. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో డీఎస్‌కు పార్టీ కండువా కప్పనున్నారు. ఈ మేరకు రాష్ట్ర నేతలకు ఏఐసీసీ నుంచి సమాచారం ఇచ్చారు. ఇప్పటికే పలుమార్లు డీఎస్‌తో చర్చించిన కాంగ్రెస్​నేతలు.. పార్టీలోకి రావాలంటూ సూచించారు. అయితే టీఆర్ఎస్‌లో ఉన్నప్పటికీ.. డీఎస్‌కు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆయన తనయుడు, నిజామాబాద్​ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు డీఎస్ తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్​.. పీసీసీ చీఫ్‌గా పని చేశారు. కాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతలను హుటాహుటినా ఢిల్లీకి రావాలంటూ ఏఐసీసీ నుంచి సమాచారమిచ్చారు. దీంతో భట్టి గురువారం రాత్రికి ఢిల్లీ వెళ్తున్నారు.

Next Story