- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్లో చేరనున్నారు. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో డీఎస్కు పార్టీ కండువా కప్పనున్నారు. ఈ మేరకు రాష్ట్ర నేతలకు ఏఐసీసీ నుంచి సమాచారం ఇచ్చారు. ఇప్పటికే పలుమార్లు డీఎస్తో చర్చించిన కాంగ్రెస్నేతలు.. పార్టీలోకి రావాలంటూ సూచించారు. అయితే టీఆర్ఎస్లో ఉన్నప్పటికీ.. డీఎస్కు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆయన తనయుడు, నిజామాబాద్ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు డీఎస్ తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్.. పీసీసీ చీఫ్గా పని చేశారు. కాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతలను హుటాహుటినా ఢిల్లీకి రావాలంటూ ఏఐసీసీ నుంచి సమాచారమిచ్చారు. దీంతో భట్టి గురువారం రాత్రికి ఢిల్లీ వెళ్తున్నారు.