ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ అరికట్టాలి: దాసోజు శ్రవణ్

by  |
Congress leader Dasoju Shravan
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ పరీక్షల విషయంలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గురువారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లో దోపిడీ చేస్తుంటే చోద్యం చూస్తుందన్నారు. జీవో 539 జీవో ఎక్కడా అమలు కావడంలేదని తెలిపారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి కరోనా కట్టడికి, అలాగే దోపిడీకి పాల్పడుతున్న కేంద్రలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed