సామాజిక దూరం ప్రాణాలకు ప్రమాదకరం

by  |
సామాజిక దూరం ప్రాణాలకు ప్రమాదకరం
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మూలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ప్రభుత్వం అందరూ సామాజిక దూరం పాటించాలని ప్రజలను హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు సామాజిక దూరం పాటించిన విధానం చూసి అందరూ నవ్వుకుంటున్నారు. సామాజిక దూరం పాటిస్తే నవ్వుకోవడం ఏంటీ అనుకుంటున్నారా.. అయితే మీరే చదవండి. ఓ వ్యక్తి నిచ్చెనను తన మెడలకు వేసుకుని ఇంకో వ్యక్తి కూడా అదే నిచ్చెనను మెడలకు వేసుకుని రెండు బైకులపై వెళ్తున్నారు. దీంతో దాన్ని ఫోటో తీసిన ఆనంద్ మహేంద్రా దాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. సామాజిక దూరం తప్పనిసరి కానీ అలా సామాజిక దూరం పాటిస్తే ప్రాణాలకు ప్రమాదకరం అంటూ పోస్ట్ ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అలానే కరోనా సమయంలో తనకు చాల నవ్వు తెప్పించిన పోటో అని ఆయన తెలిపారు.



Next Story

Most Viewed