గెల్లు గెలుపు కోసం సైకిల్ యాత్ర..

by  |
గెల్లు గెలుపు కోసం సైకిల్ యాత్ర..
X

దిశ,మణుగూరు : హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉపఎన్నికలలో గెలవాలని, టీఆర్ఎస్ అభిమాని టూతుక ప్రకాష్ సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు. మంగళవారం తెల్లవారు జామున భద్రాచలం నుండి మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నాడు. జెడ్పీటీసీ పోశం నరసింహారావు టూతుక ప్రకాష్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోశం నరసింహారావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టూతుక ప్రకాష్ ఎన్నికల ప్రచారం కొరకు భద్రాచలం నుండి హుజురాబాద్ కు సైకిల్ యాత్ర చేయడం సంతోషకరమని అన్నారు. గెల్లు యాదవ్ హుజురాబాద్ లో అధిక మెజారిటీ తో గెలవబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న దళితబంధు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు ఇలా అనేక పథకాలకు ప్రజలు ఆకర్షితులౌతున్నారన్నారు. ఈ పథకాలను గుర్తు పెట్టుకొని ఈ ఎన్నికలల్లో ప్రజలు కారు గుర్తుపై ఓట్లు వేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అడపా అప్పారావు, మండల అధ్యక్షుడు ముత్యంబాబు, టీఆర్ఎస్ యూత్ నాయకులు హర్షనాయక్,రుద్ర వెంకట్, గాజుల నరేష్, కార్యకర్తలు గణేష్, సమితి సింగారం వార్డ్ మెంబర్ ప్రవీణ్, మాదటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed