భారీ మొత్తంలో కుంకుమపువ్వు పట్టివేత

by  |
భారీ మొత్తంలో కుంకుమపువ్వు పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న కుంకుమపువ్వును కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం చోటుచేసుకుంది. గుట్టుచప్పుడు కాకుండా దుబాయ్ నుంచి చెన్నైకి తరలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా వారినుంచి 5.6 కేజీల కుంకుమ పువ్వును స్వాధీనం చేసుకొని, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. రూ.13 లక్షలు విలువజేసే ఏ1 గ్రేడ్ కుంకుమ పువ్వుగా అధికారులు గుర్తించారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసుకొని, విచారిస్తున్నారు.



Next Story