లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: 27-1-2023

by Disha Web Desk 17 |
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: 27-1-2023
X

జీవీఏలో తెలంగాణకు 8వ స్థానం:

జాతీయ స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో 3.48 శాతం వాటాతో రాష్ట్రం 10వ స్థానంలో ఉందని జాతీయ గణాంక శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కిరణ్‌కుమార్ వెల్లడించారు.

మొదటి 5 స్థానాల్లో..

1. గుజరాత్ - 15.85 శాతం

2. మహారాష్ట్ర - 14.53 శాతం

3. తమిళనాడు -11.04 శాతం

4. కర్ణాటక - 7.16 శాతం

5. ఉత్తరప్రదేశ్ - 5.5 శాతం

తెలంగాణ 3.87 శాతం వాటాతో 8వ స్థానంలో నిలిచింది.

3.48 శాతంతో ఏపీ 10వ స్థానంలో ఉంది.

ఐసీసీ ప్రకటించిన జాబితాలో కోహ్లీకి చోటు:

2022 లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో ఐసీసీ ప్రకటించిన టీ20 జట్టులో విరాట్ కోహ్లీ చోటు దక్కించుకున్నాడు. అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్య కూడా ఈ జట్టులో ఉన్నారు. గతేడాది ఫామ్‌లోకి వచ్చిన కొహ్లీ ఆసియా కప్‌లో 296 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

సూర్యకుమార్ 2 సెంచరీలు, 9 అర్థసెంచరీలతో గత ఏడాది ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు(1164) చేసిన బ్యాట్స్ మెన్‌గా నిలిచాడు.

ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ:

ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్ లాండ్), ఆన్ సియంగ్ (కొరియా) విజేతలుగా నిలిచారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో కున్లాపుత్ టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్)పై, మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ సియంగ్‌తో టాప్ సీడ్ అకానె యమగూచి (జపాన్)పై గెలిచి టైటిళ్లు సాధించారు.



Next Story