జవాన్ల మరణాలను కించపరుస్తూ.. సీఎస్‌కే డాక్టర్ ట్వీట్

by  |
జవాన్ల మరణాలను కించపరుస్తూ.. సీఎస్‌కే డాక్టర్ ట్వీట్
X

దిశ, స్పోర్ట్స్: గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన జవాన్ల‌నుద్దేశిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు డాక్టర్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది.

భారత ప్రభుత్వాన్ని, జవాన్ల మరణాలను కించపరుస్తూ డాక్టర్ మధు ట్వీట్ చేయడంతో జట్టు యాజమాన్యం అతడిని సస్పెండ్ చేసింది. మధు ట్వీట్ చేయడంతో నెటిజన్లు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్వీట్ డిలీట్ చేశాడు. కానీ, అప్పటికే స్క్రీన్ షాట్ వైరల్‌గా మారడంతో జట్టు యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనిపై స్పందిస్తూ.. ‘డాక్టర్ మధు వ్యక్తిగత ట్వీట్ గురించి సీఎస్‌కేకు తెలియదు. అయితే అతడిని జట్టు డాక్టర్‌గా తొలగిస్తున్నాం. ఆ ట్వీట్‌కు సీఎస్‌కే చింతిస్తోంది’ అంటూ సమాధానం ఇచ్చింది.



Next Story

Most Viewed