రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను సందర్శించిన సీఎస్ సోమేశ్ కుమార్

by  |
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను సందర్శించిన సీఎస్ సోమేశ్ కుమార్
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం సీఎస్ జీ.ఓ. నెంబర్ 317 అమలుపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేశాయి.

ఈ బదిలీల ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చీఫ్ సెక్రటరీని కోరగా, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని సీ.ఎస్ సోమేశ్ కుమార్ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రంగారెడ్డి కలెక్టర్ ఆమాయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, తిరుపతి రావు లు కూడా ఉన్నారు.



Next Story

Most Viewed