జాతర సక్సెస్ చేయాలి: సీఎస్

by  |
జాతర సక్సెస్ చేయాలి: సీఎస్
X

మేడారంలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి జాతర విజయవంతానికి కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సూచించారు. మేడారం జాతరకు వచ్చే ప్రతి భక్తుడికి దర్శనం సజావుగా జరిగి వారు మంచి జ్ఞాపకాలతో నుంచి తిరిగి వెళ్లేలా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. నేడు ఆయన డీజీపీ కే.మహేందర్‌రెడ్డితో కలిసి హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ నుంచి మేడారం వచ్చారు. అనంతరం శాఖల వారీగా చేపట్టిన పనులు, కలిపించిన సౌకర్యాలు, కేటాయించిన విధులపై మేడారం ఆలయ ఆవరణలో జిల్లా యంత్రాంగంతో సమీక్షించారు. అంతకు ముందు ఆయన హెలిప్యాడ్ వద్ద నుంచి జంపన్న వాగు నుంచి ఏర్పాట్లను పరిశీలిస్తూ గద్దెల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రెటరీ మాట్లాడుతూ రానున్న మూడు రోజులు కీలకమని అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధాన సెక్టార్లలో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించారు. అదే విదంగా మరుగుదొడ్లు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు రహదారులపై వాహనాలు బ్రేక్‌డౌన్ అయితే వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతర పరిసరాలు వందశాతం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. జంపన్నవాగు వద్ద నీటి ఫ్లో ను మెయిన్ టైన్ చేయాలని ఇరిగేషన్ శాఖకు అదే విధంగా నీటి వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. నిరంతర విద్యుత్ అందించాలని, అక్రమ మద్యం రవాణా, కల్తీ మద్యంను అరికట్టాలని ఆయా శాఖలను ఆదేశించారు. జాతర ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా ఉన్నతాధికారులు రోజు మేడారం వచ్చి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి హైద్రాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ను కేటాయించారని తద్వారా ముఖ్యమంత్రి జాతరకు ఇస్తున్న ప్రాముఖ్యతను గుర్తించాలన్నారు. జాతర విజయవంతానికి వేసిన ప్రణాలికను అమలుపర్చాలన్నారు. అధికారుల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు.పారదర్శకంగా, బాధ్యతాహితంగా అధికారులు విధులు నిర్వహించాలన్నారు.

డీజీపీ కె.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ… భక్తులకు సజావుగా దర్శనం జరిగేలా పటిష్ట చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణలో నిష్ణాతులైన ట్రాఫిక్ పోలీస్ అధికారులను మేడారం జాతరలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు నియమించి పక్కా ట్రాఫిక్ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇద్దరు డీఐజీ ర్యాంక్ అధికారులు, ఆరుగురు ఎస్పీలు, 12 వేల పోలీస్ యంత్రాంగంతో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు ఆయన వివరించారు. మహిళల భద్రతకు ప్రత్యేకంగా షీ టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. వాహనాలను పార్కింగ్ స్ధలాల్లోనే నిలపేల చసుకోవాలన్నారు. జాతర వ్యాప్తంగా సీసీ కెమెరాలతో 24 గంటలు పర్యవేక్షణ జరుగుతోందన్నారు. తొక్కిసలాట జరగకుండా నిరంతరంగా అప్రమత్తంగా ఉండాలని పోలిస్ అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ… జాతరలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రద్దీ క్రమబద్ధీకరణకు అవసరమైన బారికేడింగ్ చేశామన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి గద్దెల మీదకు తీసుకువచ్చేందుకు ఎస్పీ తో కలిసి ట్రయిల్ రన్ చేశామని, అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో తొక్కిసలాట జరగకుండా ఏర్పాట్లు చేశామని వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ… ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. పార్కింగ్ స్థలాలు సిద్ధంగా ఉన్నామని అక్కడ ఫ్లడ్ లైట్లు, సీసీ కెమెరాల ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. జంపన్నవాగు లో రోపులు ఏర్పాటు చేశామని భక్తుల భద్రతకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి వీపి గౌతమ్, ఓఎస్డీ కృష్ణ ఆదిత్య, ఏటూర్ నాగారం ప్రాజెక్ట్ అధికారి హనుమంతు, కొండిబా జెడ్, చక్రధర్ రావు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed