వలస కార్మికులకు అండగా సీఆర్పీఎఫ్ జవాన్లు

by  |
వలస కార్మికులకు అండగా సీఆర్పీఎఫ్ జవాన్లు
X

దిశ, కరీంనగర్: ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు ఒడిశా నుంచి రాష్ట్రానికి వలస వచ్చిన కార్మికులకు సీఆర్పీఎఫ్ జవాన్లు బాసటగా నిలిచారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో నివసిస్తున్న వలస కార్మికులకు భోజనం ఏర్పాట్లు చేశారు. సీఆర్పీఎఫ్ ఏ/58 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ మంజుల ఆధ్వర్యంలో వారికి ఆహారం అందజేశారు. అనంతరం పౌష్టికాహారం ఇవ్వడంతోపాటు కొవిడ్-19 కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

Tags: crpf jawans, food provide, migrant labourers

Next Story