పెట్రోల్ బంకుల యాజమాన్యంపై క్రిమినల్ కేసు..

by  |
పెట్రోల్ బంకుల యాజమాన్యంపై క్రిమినల్ కేసు..
X

దిశ, వెబ్‌డెస్క్ :

కామారెడ్డి జిల్లాలోని రెండు పెట్రోల్ బంకుల యాజమానులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆదివారం జిల్లాలోని పలు పెట్రోల్ బంకులపై లీగల్ మెట్రాలజీ అధికారులు, పోలీసులు రైడ్స్ జరిపారు.

ఈ నేపథ్యంలోనే అత్యాధునిక చిప్‌లను అమర్చి వినియోగదారులను మోసం చేస్తున్న రెండు బంకులను గుర్తించారు. ఈ మేరకు యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇకమీదట ఎవరైనా పెట్రోల్ బంకుల్లో వినియోగదారులను మోసం చేసినట్లు తేలితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.


Next Story

Most Viewed