ఎట్టకేలకు మృతదేహం లభ్యం.. రెండురోజుల ఉత్కంఠకు తెర

by Disha Web Desk |
ఎట్టకేలకు మృతదేహం లభ్యం.. రెండురోజుల ఉత్కంఠకు తెర
X

దిశ,మణుగూరు/పినపాక : పినపాక మండలం రావిగుడానికి చెందిన చిట్టిమల్ల సురేష్ రెండు రోజుల క్రితం బతుకమ్మ నిమజ్జనం కోసం వెళ్లి గోదావరిలో గల్లంతు అయిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం సురేష్ మృతదేహం అశ్వాపురం మండలంలోని పాములపల్లి గోదావరి ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. మృతదేహాన్ని గుర్తించిన జాలరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బోటు సాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

Next Story