విషాదం.. కోతుల దాడిలో పదేళ్ల బాలుడు మృతి

by Disha Web Desk 4 |
విషాదం.. కోతుల దాడిలో పదేళ్ల బాలుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కోతి దాడిలో పదేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ లో చోటు చేసుకుంది. ఫారెస్ట్ ఆఫీసర్లు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దహేగాం తాలుకాలోని సల్కి గ్రామంలోని ఓ గుడి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన బాలుడిని దీపక్ ఠాకూర్ గా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో దీపక్ ఠాకూర్ తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు. బాలుడి పేగులను కోతులు చీల్చినట్లు అధికారులు తెలిపారు.

స్థానికంగా ఉన్న ఆస్పత్రికి హుటాహుటిన తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. వారం వ్యవధిలో కోతులు ఇదే చోటు వద్ద మూడోసారి దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. అటవీ శాఖ అధికారి విశాల్ చౌదరి మాట్లాడుతూ.. గ్రామంలో కోతులను బందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గ్రామంలో పెద్ద సంఖ్యలో కోతులు ఉన్నాయన్నారు. వారం వ్యవధిలో నలుగురిపై కోతులు దాడికి పాల్పడ్డాయని అధికారులు తెలిపారు.


Next Story

Most Viewed