పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదం.. కలుషిత ఆహారం తిని ముగ్గురు మృతి

by Disha Web Desk 12 |
పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదం.. కలుషిత ఆహారం తిని ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఓ ఇటుకల బట్టీ కార్మికులు కలుషిత ఆహారం తినడం తో ముగ్గురు మృతి చెందగా మరో 16 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద సంఘటన పెద్ద జిల్లాలో గౌరెడ్డి పేట లో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన కార్మికులను హుటాహుటిన వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నట్లు తెలుస్తుంది. మృతులు ఓడిషా కు చెందిన కార్మికులుగా స్థానికులు గుర్తించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed