- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బైక్ను ఢీకొట్టిన లారీ.. అక్కడికక్కడే మహిళ మృతి
by Disha Web Desk 19 |
X
దిశ, వలిగొండ: లారీ ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలోని మాందాపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ పట్టణం బీసీ కాలనీకి చెందిన అడ్డగుల్ల కిరణ్, లక్ష్మీలు గత కొంతకాలంగా బతుకుదెరువు కోసం వెళ్లి బీబీనగర్ మండలం రాఘవపురంలో నివాసం ఉంటున్నారు. ఇటీవల కిరణ్ తండ్రి మృతిచెందగా శుక్రవారం ఐదు రోజుల కర్మ కార్యక్రమానికి భార్య లక్ష్మితో కలిసి మోటార్ సైకిల్పై వస్తుండగా మార్గమధ్యంలో మాందాపురం గ్రామం దుర్గమ్మ గుడి వద్దకు రాగానే వెనుక నుండి వస్తున్న లారీ నెంబర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. ఢీ కొట్టిన లారీ తప్పించుకొని అతివేగంగా వెళుతుండగా నాగారం గ్రామానికి చెందిన యువకులు స్కూల్ బస్సును రోడ్డుకు అడ్డంగా పెట్టి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
Next Story