దారుణం.. ఇన్‌ఫార్మర్ నెపంతో వ్యక్తిని కాల్చి చంపిన మావోయిస్టులు

by Disha Web Desk 19 |
దారుణం.. ఇన్‌ఫార్మర్ నెపంతో వ్యక్తిని కాల్చి చంపిన మావోయిస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కాంకేర్ జిల్లా నేలగొండలో చోటు చేసుకుంది. ఇన్ ఫార్మర్ అనే నెపంతో నేలగొండకు చెందిన ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు అతడిని కాల్చి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed