- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రైట్ కామ్ గ్రూప్పై ముగిసిన ఈడీ సోదాలు
హైదరాబాద్లోని బ్రైట్ కామ్ గ్రూప్పై ఈడీ సోదాలు ఇవాళ ముగిశాయి. విదేశాల్లోని అనుబంధ సంస్థల ద్వారా బ్రైట్కామ్ గ్రూప్ రూ.868.30 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి ఫ్రాడ్ జరిగినట్టుగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రిపోర్ట్ను వెలువరించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్లోని బ్రైట్ కామ్ గ్రూప్పై ఈడీ సోదాలు ఇవాళ ముగిశాయి. విదేశాల్లోని అనుబంధ సంస్థల ద్వారా బ్రైట్కామ్ గ్రూప్ రూ.868.30 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి ఫ్రాడ్ జరిగినట్టుగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రిపోర్ట్ను వెలువరించింది. సెబీ రిపోర్ట్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ఆడిటర్ మురళి మోహనరావుతో పాటు కంపెనీ సీఈఓ సురేష్ రెడ్డి ఇళ్ళలో సోదాలు చేసింది. ఫెమా చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మురళి మోహన్ ఇంటి నుంచి 3.30 కోట్ల రూపాయల నగదుతో పాటు 9.30 కోట్లు విలువ చేసే బంగారం, ఇతర వస్తువులను ఈడీ స్వాధీనం చేసుకుంది. అనుబంధ కంపెనీలకు నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.
Next Story






