BREAKING: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రధాన రహదారిలో కారు బీభత్సం.. ఐదుగురికి తీవ్ర గాయాలు

by Disha Web Desk 1 |
BREAKING: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రధాన రహదారిలో కారు బీభత్సం.. ఐదుగురికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రధాన రహదారిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి వాహనదారులు పోలీసులకు సమాచారం అందజేయగా వారు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తలించారు. బంధువులకు ఎయిర్‌పోర్టులో వీడ్కోలు చెప్పి వస్తుండగా ప్రమాదం సంభవించింది. గాయపడిన వారంతా సంగారెడ్డి వాసులుగా పోలీసులు గుర్తించారు.

Next Story