BREAKING: బాలానగర్‌లో గంజాయి చాక్లెట్లు లభ్యం.. పోలీసుల అదుపులో నిందితుడు

by Disha Web Desk 1 |
BREAKING: బాలానగర్‌లో గంజాయి చాక్లెట్లు లభ్యం.. పోలీసుల అదుపులో నిందితుడు
X

దిశ, వెబ్‌డెస్క్: పోలీసులు ఎన్ని తనిఖీలు చేపడుతున్నా.. గంజాయి దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్ నగరంలోని బాలానగర్‌లో భారీగా గంజాయి చాక్లెట్లు లభ్యమయ్యాయి. ఒడిశాకు చెందిన అనంత కుమార్ బాలనగర్ ప్రాంతంలోని ఘరక్ కంఠా ప్రాంతంలో ఓ చిన్న కిరాణా షాపును నిర్వహిస్తున్నాడు. అతడు నిత్యావసర సరుకులతో పాటు గంజాయి చాక్లెట్లను కూడా విక్రయిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్‌వోటీ పోలీసులు కిరాణా షాపుపై దాడి చేశారు. తనిఖీల్లో భాగంగా షాపులో మూడు ప్యాకెట్లలో 125 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా నిందితుడు అనంత కుమార్ గంజాయి చాక్లెట్లను ఒడిశా నుంచి హైదరాబాద్‌లోని బాలానగర్ ప్రాంతానికి తీసుకొచ్చి కూలీలకు, విద్యార్థులకు అమ్ముతునట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిపై బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.



Next Story

Most Viewed