BREAKING: ఏపీ తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై హత్యాయత్నం

by Disha Web Desk 1 |
BREAKING: ఏపీ తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై హత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది.జయరాం సెంటర్‌లోని జిమ్స్‌ ఆసుపత్రిలో డాక్టర్‌ రామచంద్రారెడ్డితో శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై మాట్లాడుతుండగా.. రామచంద్రారెడ్డి అనుచరులు ఆయనపై కత్తులతో ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. దీంతో శ్రీనివాస్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు ఆయనను చికిత్స నిమిత్తం ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఘటనకు సంబంధించి వివరాలు టీడీపీ నాయకులను అడిగి తెలుసుకున్నారు.

Read More..

Breaking: టీడీపీలోకి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి?



Next Story

Most Viewed