బిగ్ బ్రేకింగ్ : మెట్ పల్లి పట్టణంలో అర్ధరాత్రి దారుణ హత్య

by Disha Web Desk 1 |
బిగ్ బ్రేకింగ్ : మెట్ పల్లి పట్టణంలో అర్ధరాత్రి దారుణ హత్య
X

కన్నం సతీష్ అనే వ్యక్తిని కిరాతకంగా హతమార్చిన దుండగులు

దిశ, మెట్ పల్లి : అర్ధరాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన మెట్ పల్లి పట్టణంలోని వేంకట్రావ్ పేట కాలనీలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. దీంతో మెట్ పల్లి పట్టణంలో ఒక్కసారిగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సై శ్యాంరాజ్ కథనం మేరకు.. వెంకట్రావ్ పేట్ కాలనీలో ఓ బార్ వద్ద పట్టణంలోని చావిడి ప్రాంతానికి చెందిన కన్నం సతీష్ గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా కొట్టి హతమార్చారు. స్థానికుల సమాచారం మేరకు.. హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అప్పటికే సతీష్ మృతి చెందినట్లుగా పోలీసులు ధృవీకరించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఎస్సై శ్యాంరాజ్ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Next Story