భద్రాచలం టౌన్ పీఎస్లోనూ ఏసీబీ దాడులు

by Disha Web Desk 15 |
భద్రాచలం టౌన్ పీఎస్లోనూ ఏసీబీ దాడులు
X

దిశ, భద్రాచలం : పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసిన విషయం వెలువడి కొన్ని నిమిషాలు కూడా కాకముందే భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక కేసు విషయంలో లంచం డిమాండ్ చేసిన ఎస్ఐతో పాటు సీసీ కెమెరాలు చూసే ఓ కానిస్టేబుల్ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లు సమాచారం. ఇంకా ఏసీబీ అధికారులు స్టేషన్లోనే ఉన్నారు. స్టేట్మెంట్ తీసుకుంటున్నట్లు గా తెలిసింది. పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

Next Story

Most Viewed