కన్నీరు పెట్టించే ఘటన.. గుండెపోటుతో ఆరేళ్ల చిన్నారి మృతి

by Disha Web Desk 6 |
కన్నీరు పెట్టించే ఘటన.. గుండెపోటుతో ఆరేళ్ల చిన్నారి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొద్ది కాలంగా చాలా మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. చూస్తుండగానే ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ప్రస్తుతం ఎక్కువగా గుండె పోటు మరణాలు చూస్తున్నాం. పసి పిల్లల కానుండి పండు ముసలి వారి దాకా గుండె పోటు వస్తుంది. తాజాగా, ఢిల్లీలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన విహాన్ జైన్ పెళ్లి వేడుకకు తల్లిదండ్రులతో కలిసి వెళ్లాడు. అక్కడ కాసేపటికి అస్వస్థతకు గురికావడంతో అది గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ విహాన్ మృతి చెందాడు. గుండె కండరాల వాపు వల్లే చనిపోయాడని వైద్యులు తెలిపారు. దీని వల్ల శరీరానికి రక్తం సరఫరా ఆగిపోయి హార్ట్ ఎటాక్ వస్తుందని వెల్లడించారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.


Next Story