ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన జీప్.. ఏడుగురు దుర్మరణం

by Disha Web Desk 19 |
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన జీప్.. ఏడుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం కెంఝహార్ జిల్లా బాలిజోడి వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed