ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

by Disha Web Desk 1 |
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
X

దిశ, కొండపాక : ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గజ్వేల్ మండల పరిధిలోని కొడకండ్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుకునూరుపల్లి ఎస్ఐ పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. కొడకండ్ల గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన ముండ్రాతి వేణు (28), అతని తండ్రి రాములుకు ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్య కుమారుడు గత నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. అదేవిధంగా వేణు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం తెలిసిన వారి వద్ద అప్పు చేశాడు.

ఈ క్రమంలో తనకు అప్పు తీర్చే మార్గం లేకపోవడతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. అనంతరం ఇంటికి వెళ్లిన వెణు నోట్లోంచి నూరుగులు రావడంతో ఏమైందని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. పురుగుల మందు తాగానని తెలిపాడు. అతడిని వెంటనే గజ్వెల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని ఆర్.వీ.ఎం ఆసుపత్రికి తరలించగా బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుకునూరుపల్లి ఎస్సై పుష్పరాజ్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed