డ్రమ్ములో మహిళ మృతదేహం.. 3 నెలల్లో మూడో ఘటన

by Disha Web Desk 12 |
డ్రమ్ములో మహిళ మృతదేహం.. 3 నెలల్లో మూడో ఘటన
X

దిశ, వెవ్‌డెస్క్: డ్రమ్ములో మహిళా మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించి కలకలం సృష్టించింది. ఈ ఘటన బెంగళూరులోని SMVT రైల్వే స్టేషన్ లో వెలుగు చూసింది. బ్లూ కలర్ ప్లాస్టిక్ డ్రమ్ములో ఉన్న మృతదేహం కుళ్లిపోయి ఉందని.. మృతదేహం ముప్పై ఏళ్ల వయసున్న మహిళదని, ముగ్గురు వ్యక్తులు డ్రమ్‌ను మోసుకెళ్తున్నట్లు చూపించే సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా బెంగళూరులో మూడు నెలల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది తెలుస్తుంది. దీంతో వరుసగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటుండడంతో.. అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Next Story