లక్ష్మారెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

by Bhanu |

హయత్​నగర్ ​పోలీస్​స్టేషన్ ​పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్రగాయాలై చికిత్స..

లక్ష్మారెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
X

దిశ, వనస్థలిపురం: హయత్​నగర్ ​పోలీస్​స్టేషన్ ​పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్రగాయాలై చికిత్స పొందుతూ చనిపోయింది. సీఐ నాగరాజు గౌడ్ ​వివరాల ప్రకారం.. పెద్ద అంబర్​పేట మున్సిపాలిటీ పరిధిలోని సాయికుటీర్​లో నివాసముండే కొమ్మ మల్లయ్య భార్య అలివేలు (60) కార్మికురాలిగా పనిచేస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం లక్ష్మారెడ్డి పాలెం హనుమాన్​ ఆలయ సమీపంలో హైవే రోడ్డు దాటుతుండగా.. విజయవాడ నుంచి హైదరాబాద్​కు వస్తున్న అశోక్​ లేలాండ్​ మినీ వ్యాన్ ​ఢీకొట్టింది.

తీవ్రగాయాలైన అలివేలును స్థానికులు వెంటనే అంబులెన్స్​లో సమీపంలోని సన్‌రైజ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు వ్యాన్​ డ్రైవర్​ఇలియాస్ బిన్ హసన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Next Story