పిడుగుపాటుకు మహిళ మృతి..

by Disha Web Desk 11 |
పిడుగుపాటుకు మహిళ మృతి..
X

దిశ, వంగూర్: పిడుగుపాటుకు గురై ఓ మహిళ మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండల పరిధి వెంకటాపూర్ గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటాపూర్ గ్రామంలో శనివారం ఉరుము, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది.

అదే సమయంలో పిడుగు పడడంతో అక్కడే ఉన్న గ్రామానికి చెందిన కటికర్ల కృష్ణమ్మ (50) చెందింది. దీంతో కృష్ణమ్మ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోావాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోరారు.

Next Story

Most Viewed