ఆ మహిళ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసా..

by Disha Web Desk 20 |
ఆ మహిళ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసా..
X

రాజేంద్రనగర్, దిశ : కొడుకు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కిష్టయ్య తెలిపిన వివరాల ప్రకారం కింగ్స్ కాలనీకి చెందిన మెహర్ సుల్తానా (48) ఆమె భర్త మహ్మద్ అహ్మద్ గతంలోనే మృతి చెందాడు. మెహర్ సుల్తానాకు కూతురు, కుమారుడు ఉన్నారు. కుమార్తె అమెరికాలో ఉండగా కొడుకు సుల్తానాతో కలిసి వుంటున్నారు.

సుల్తానా కొడుకు ముజఫర్ అహ్మద్ (27) ఇటీవల తల్లికి ఇష్టం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో తల్లి కొడుకులిద్దరి మధ్య 15 రోజులుగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. తనకు ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకోవడంతో మనస్తాపానికి గురైన సుల్తానా కొడుకును ఇంట్లో నుండి వెళ్లిపోవాలని హెచ్చరించింది. గత రెండు రోజులుగా అమెరికా నుండి సుల్తానా కూతురు ఫోన్ చేస్తున్నా ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడంతో ముజఫర్ అహ్మద్ కు ఫోన్ చేసి ఇంటికి వెళ్ళమని కోరింది.

ముజఫర్ అహ్మద్ సమీప బంధువులను తీసుకొని కింగ్స్ కాలనీలోని ఇంటికి వెళ్ళారు. ఎంతకూ తలుపులు తీయకపోవడంతో బాల్కనీ నుండి ఇంట్లోకి వెళ్లి చూశారు. మెహర్ సుల్తానా కాలిన గాయాలతో మృతిచెందినట్లు గుర్తించారు. వెంటనే పోలసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కేస్ గా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కిష్టయ్య తెలిపారు.


Next Story

Most Viewed