HYD: కత్తితో పొడిచి భార్యను భవనం మీదనుంచి పడేసిన భర్త

by Disha Web Desk 2 |
HYD: కత్తితో పొడిచి భార్యను భవనం మీదనుంచి పడేసిన భర్త
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ శివారులోని వనస్థలిపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేసిన భర్త రాజ్‌కుమార్.. ఆపై భవనం మీదకు లాక్కెళ్లి కిందకు తోసేశాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చుట్టుపక్కల వారిని వివరాలు అడగ్గా.. కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్లు తెలిసింది. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హైకోర్టు 4వ గేటు వద్ద రాజ్‌కుమార్ పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి: లిఫ్ట్ ఇస్తామని కారులో ఎక్కించుకుని.. విద్యార్థినిపై దారుణం

పెళ్లికి వెళ్తుండగా యాక్సిడెంట్.. దంపతులు స్పాట్‌డెడ్


Next Story

Most Viewed