Uttarakhand: టన్నెల్‌లో రెండు రైళ్లు ఢీ, 109 మంది కార్మికులకు గాయాలు

by Malleboina Mahesh |

నిర్మాణంలో ఉన్న THDC విష్ణుగడ్-పీపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద భారీ ప్రమాదం చోటు చేసకొని 109 మంది కార్మికులకు గాయాలు అయ్యాయి.

Uttarakhand: టన్నెల్‌లో రెండు రైళ్లు ఢీ, 109 మంది కార్మికులకు గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: చమోలీ జిల్లా పీపల్‌కోటిలో నిర్మాణంలో ఉన్న THDC విష్ణుగడ్-పీపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు (Hydroelectric project) వద్ద భారీ ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్ లోపల కార్మికులను తరలించే రెండు లోకో రైళ్లు (Loco trains) షిఫ్ట్ మార్పిడి సమయంలో ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో టన్నెల్ లోపల మొత్తం 109 మంది కార్మికులు ఉన్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Chief Minister Pushkar Singh Dhami) జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

ఈ ప్రమాదంలో గాయపడిన మొత్తం 109 మంది కార్మికులకు అధికారులు తక్షణ వైద్య సహాయం (Immediate medical attention) అందించారు. జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గోపేశ్వర్ జిల్లా ఆసుపత్రికి తరలించిన 70 మందిలో 66 మంది ప్రాథమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు, నలుగురు చికిత్స పొందుతున్నారు. పీపల్‌కోటి వివేకానంద ఆసుపత్రిలో మరో 18 మందికి చికిత్స అందించి పంపించగా, ఎటువంటి గాయాలు తగలని 21 మంది కార్మికులు నేరుగా తమ ఇళ్లకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు.

Next Story