గుర్తు తెలియని వ్యక్తి మృతి..

by Disha Web Desk 11 |
గుర్తు తెలియని వ్యక్తి మృతి..
X

దిశ, శంకర్పల్లి: ఎండ వేడిమి తట్టుకోలేక గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. శంకర్పల్లి దండు రాజేశ్వర్ బట్టల షాప్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి చనిపోయి ఉండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి పేరు, ఊరు వివరాలు తెలియ రాలేదు.

మృతుని వయస్సు సుమారు 40 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉంటుంది. మృతుడి ఒంటిపై ఇండియన్ ఆయిల్ టీ షర్టు, నల్ల రంగు తెల్లటి చారల నెక్కరు ఉంది. తిండి తినకపోవడం, ఎండ వేడిమి తట్టుకోలేకనే చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Next Story

Most Viewed