గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి..

by Bhanu |

జనగామ జిల్లా యశ్వంతపూర్ గ్రామంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి..
X

దిశ, జనగామ: జనగామ జిల్లా యశ్వంతపూర్ గ్రామంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుమారు ఉదయం 6 గంటలకు గ్రామస్తులు తెలిపిన సంవత్సరం మేరకు నడుచుకుంటూ వెళుతున్న పాదాచారిని వాహనం ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలు అక్కడికక్కడే మృతి చెందాడని అన్నారు. మృతుని వివరాలు తెలియ రాలేదు అన్నారు.

మృతుడు సుమారు 40 నుండి 50 సంవత్సరాల వయసు గలవారు అని కుడి చేతి పై అమ్మానాన్న పచ్చబొట్టు కలదు అని తెలిపారు. పై ఆధారాలతో గుర్తుతెలియని మృతదేహం కు సంబంధించి ఎలాంటి వివరాలు లభించిన వెంటనే జనగామ పోలీసులకి సమాచారం అందజేయగలరు అని తెలిపారు.మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు. జనగామ ఎస్ హెచ్ ఓ ..8712685202, ఎస్ఐ-8712685260,పి ఎస్ :8712685032.

Next Story