గుడిలోని హుండీని దొంగిలించిన గుర్తుతెలియని దుండగులు..

by Disha Web Desk 20 |
గుడిలోని హుండీని దొంగిలించిన గుర్తుతెలియని దుండగులు..
X

దిశ, మేళ్లచెరువు : గుర్తుతెలియని దుండగులు గుడిలోనే హుండీని దొంగలించుకుని వెళ్ళిన సంఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని వెల్లటూరు గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి . వెల్లటూరు గ్రామంలోని ఆర్ఎన్ఆర్ సెంటర్ లోని శ్రీ కంఠ మహేశ్వరుని స్వామి దేవాలయంలో శనివారం రాత్రి సమయంలో తలుపులను పగులకొట్టిన గుర్తు తెలియని దుండగులు హుండీ దొంగిలించి ఎత్తుకెవెళ్లారు. ఆ హుండీని కండదిబండ శివారులో గల మంగలకుంట తండా రోడులో వెంటగల సాగర్ కాలవ బిడ్జి పక్కన వదలి వెళ్లారు. స్థానికులు మేళ్లచెరువు పోలీసులకు సమాచారం అందించారు. ఆ హుండీని పగల కొట్టిన చోటుకు చేరుకున్న పోలీసులు అక్కడ హుండీ తాళం పగలగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకు వెళ్లినట్లు గుర్తించారు. ఈ దేవాలయమును ఈనెల 14న ప్రతిష్టించారు. ఆ హుండీలో సుమారు 30 వేల వరకు నగదు ఉండవచ్చునని సమాచారం.



Next Story

Most Viewed