ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతి

by Disha Web Desk 1 |
ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతి
X

దిశ, మల్లాపూర్ : రెండు బైక్ లు ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన మండల పరిధిలోని రాఘవ పేట్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎస్సై నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ అప్సర్ (34) మెట్ పల్లి వైపు బైక్ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మొగిలిపేట్ గ్రామానికి చెందిన దండ్ల సాయిలు ఎదురుగా వచ్చి అప్సర్ బైక్ ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అప్సర్ తలకు బలమైన గాయం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ముంతాజ్ బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.

Next Story

Most Viewed