బైకులు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగల అరెస్ట్​

by Chintha Aamani |

బైక్ ను దొంగలించిన ఇద్దరు దొంగలను నాగోల్ ​పోలీసులు గంటల వ్యవధిలోని పట్టుకుని అరెస్టు​ చేసి రిమాండ్​కు తరలించారు.

బైకులు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగల అరెస్ట్​
X

దిశ,వనస్థలిపురం: బైక్ ను దొంగలించిన ఇద్దరు దొంగలను నాగోల్ ​పోలీసులు గంటల వ్యవధిలోని పట్టుకుని అరెస్టు​ చేసి రిమాండ్​కు తరలించారు. నాగోల్ ఎస్​హెచ్​వో ఎండీ మక్బూల్ జానీ వివరాల ప్రకారం.. ఆనంద్​నగర్​కు చెందిన విద్యార్థి జి. భానుచరణ్​ శ్రీ దుర్గా బాయ్స్​హాస్టల్ ఎదురుగా ఆదివారం రాత్రి పది గంటలకు తన పల్సర్​బైక్​ను పార్క్ చేసి తిరిగి సోమవారం ఉదయం లేచి చూసుకునేసరికి బైక్​కనిపించలేదు. వెంటనే బాధితుడు నాగోల్​పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు క్రైమ్ ఎస్సై నరసింహ ఆధ్వర్యంలో క్రైమ్ టీం సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. నేరస్తులు నాగోల్​చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా నెంబర్ ప్లేట్ లేని బండి పై తిరుగుతున్నట్లు గుర్తించారు.

వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న క్రైమ్ టీమ్​సభ్యులు పోలీస్​స్టేషన్​కి తీసుకెళ్లి విచారించారు. ఇద్దరిలో ఒకరు గుంటూరు జిల్లా మాచర్ల మండలం పెద్దగోదమ్ముల గ్రామానికి చెందిన కడియం హోసన్న , మరొకరు గుంటూరు జిల్లా మాచర్ల మండలం , కంభంపాడు గ్రామానికి చెందిన కలివెల నాగేంద్ర బాబు గా గుర్తించారు. ఇద్దరు కలిసి పల్సర్​బైక్​ను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. అలాగే వీరు గుంటూరు లో కూడా కొన్ని బైకులు దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నారు. వీరిని అరెస్ట్​చేసి రిమాండ్​కు తరలించినట్లు ఎస్​హెచ్​వో ఎండీ మక్బూల్ జానీ తెలిపారు.

Next Story