- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం సభకు తరలిస్తున్న జనరేటర్ వాహనం ఢీకొని ఇద్దరి మృతి
by Sathputhe Rajesh |
తెనాలిలో జరిగే సీఎం సభకు తరలిస్తున్న జనరేటర్ వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు.

X
దిశ, వెబ్డెస్క్: తెనాలిలో జరిగే సీఎం సభకు తరలిస్తున్న జనరేటర్ వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. చేబ్రోటు మండలం వడ్లమూడి సమీపంలోని గరువుపాలెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీ జనరేటర్ను ఓ ఆటోకు వెనకభాగంలో తాడుతో కట్టి నారా కోడూరు నుంచి తెనాలికి తరలిస్తుండగా గరువుపాలెం వద్ద జనరేటర్ - ఆటోకు కట్టిన తాడు తెగిపోయింది. అదే సమయంలో మహిళా కూలీలతో వస్తున్న ఆటో జనరేటర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ లో రమణమ్మ(50), శాంబ(25) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో తొమ్మిది మందిని తెనాలి, గుంటూరు, వడ్లమూడి హాస్పిటల్లకు తరలించారు.
Next Story






