కాటేస్తున్న కరెంటు తీగలు.. పాతబస్తీలో మరో ఇద్దరు దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-19 03:06:03  IST  )

నగర పరిధిలోని రామాంతపూర్ గోఖలే‌నగర్‌లో ఆదివారం రాత్రి విద్యుత్ షాక్‌తో ఆరుగురు దుర్మరణం పాలైన ఘటన మరువక ముందే పాతబస్తీ (Old City)లో మరో విషాదం చోటుచేసుకుంది.

కాటేస్తున్న కరెంటు తీగలు.. పాతబస్తీలో మరో ఇద్దరు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: నగర పరిధిలోని రామాంతపూర్ గోఖలే‌నగర్‌లో ఆదివారం రాత్రి విద్యుత్ షాక్‌తో ఆరుగురు దుర్మరణం పాలైన ఘటన మరువక ముందే పాతబస్తీ (Old City)లో మరో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బండ్లగూడ (Bandlaguda)లో మంగళవారం తెల్లవారుజామున ఇద్దురు యువకులు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షంలో వినాయకుడి విగ్రహం తీసుకెళ్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌పై ఉన్న విగ్రహం కిరీటానికి హై టెన్షన్ వైర్లు తగిలాయి. ఈ దుర్ఘటనలో టోనీ (21), వికాస్ (20) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు అఖిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. అతడి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story